రాష్ట్రీయం

శ్రీవారికి రూ.13.5 కోట్లు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 14: అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఐ.రవి, జి.శ్రీనివాసు టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ. 13.5 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఉదయం ఈ విరాళం డీడీలను దాతలు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు అందించారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఆర్ ఎక్స్ అడ్వాన్స్, ఫార్మ పరిశ్రమ వ్యవస్థాపకులు, సీఈఓ ఐకా రవి శ్రీవారి హుండీకి రూ. 10 కోట్లు విరాళంగా అందించారు. అలాగే గుత్తికొండ శ్రీనివాస్ రూ. 3.5 కోట్లు వివిధ ట్రస్టులకు విరాళంగా అందించారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి, సర్వశ్రేయట్రస్టుకు రూ. కోటి, బర్డ్‌కు రూ. కోటి, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ. 10లక్షలు, విద్యాదానం ట్రస్టుకు రూ. 10లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ. 10లక్షలు, కాటేజీ డొనేషన్ స్కీమ్‌లో భాగంగా నందకం అతిధి భవనానికి రూ. 20లక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అమరనాథ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు పొట్లూరు రమేష్ బాబు, సండ్ర వెంకట వీరయ్య, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..తిరుమలలో శనివారం టీటీడీ చైర్మన్‌కు విరాళం అందిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు.
చిత్రంలో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు