రాష్ట్రీయం

జగన్, పవన్ రాజకీయ బఫూన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ రాజకీయ బఫూన్లని, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని టీడీపీ మోసం చేసిందని పవన్ కళ్యాణ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని దగ్గరకు వెళ్లానని చెబుతున్నారని, ప్రధాని ఏమి అన్నారో చెప్పాలన్నారు. రాజ్యసభ సీటు కోసం అమ్ముడుపోయే వ్యక్తిత్వం పవన్‌దా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు పంటలు పండించే భూములను రాజధాని నిర్మాణానికి లాక్కున్నామనడం ఆయన అవగాహనాలేమిని తెలియచేస్తుందన్నారు. వైకాపా, బీజేపీ నేతలు రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారని, కానీ గుజరాత్‌లో డొలేరా నగరాన్ని 2.5 లక్షల ఎకరాల్లో నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. అన్ని వేల ఎకరాలు ఎందుకు అని మోదీని ప్రశ్నించారా అని విమర్శించారు. 8 వేల ఎకరాల్లో రాజధాని నగరం నిర్మిస్తున్నామని, మిగిలిన భూమిని పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. మోదీకి జగన్, పవన్ జోడెద్దులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎంపీలు సోమవారం కూడా రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారని, కానీ వైకాపా ఎంపీల జాడ లేదన్నారు. నేరస్తులతో కలిసి మోదీ పని చేస్తున్నారని, బంద్ రూపంలో హింస చోటు చేసుకునే వీలు ఉందన్నారు.