రాష్ట్రీయం

27న చంద్రగ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 25: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 27న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఆరోజు సాయంత్రం 5 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం మూసివేయనున్నారు. 28న సంప్రోక్షణ అనంతరం శనివారం ఉదయం 7 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. 27న శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 28న శనివారం ఉదయం 3.49 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలకు ముందు గా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. 28న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. కాగా చంద్రగ్రహణం కారణంగా 27వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దుచేసింది. అలాగే ఈనెల 27న నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టీటీడీ రద్దుచేసింది. గ్రహణ కారణంగా 27న తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా మూసివేస్తామని టీటీడీ అధికారులు చెప్పారు.