రాష్ట్రీయం

7న ముంబాయ్‌లో ఓబీసీ జాతీయ మహా సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: బీసీలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 7న ముంబాయ్‌లో ఒబీసీ జాతీయ మహా సభలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, ఉపాద్యక్షుడు గుజ్జ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. విరోభా లక్ష్మీ తెలిపారు. ముంబాయ్‌లోని నేషనల్ స్పోర్ట్ క్లబ్‌లో ఈ మహా సభలు నిర్వహించనున్నట్లు వారు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి 5 వేల మంది ప్రతినిధులు ఈ మహా సభలకు హాజరవుతారని వారు వివరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రులు హంసరాజ్ గంగారాం, 8 మంది రాష్ట్ర మంత్రులు, 40 మంది ఎంపీలు, ప్రతిపక్ష నేతలు పాల్గొంటారని వారు తెలిపారు.