రాష్ట్రీయం

ప్రేమ ‘పగ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 4: తాను ప్రేమిస్తున్న అమ్మాయిని తన స్నేహితుడు ప్రేమిస్తుండటం భరించలేక క్లాస్‌మేట్ అనే విషయం కూడా మరచి దారుణంగా గొంతు,నాలుక కోసివేసిన దారుణ సంఘటన సోమవారం చిత్తూ రు జిల్లా గాజులమండ్యం ప్రాంతంలో జరిగింది. ఈ దురాగతాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థి కత్తిపోట్లుకు గురైయ్యాడు. గాజులమండ్యం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలం గంగిరెడ్డి పల్లికి చెందిన జానకిరామిరెడ్డి అలియాస్ జాని (19), గాజుల మండ్యంకు చెందిన వంశీ రాయల్ (19) కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరితోపాటు చదువుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఇద్దరూ ప్రేమిస్తున్నారు. అయితే వంశీరాయల్ ఆ అమ్మాయి తననే ప్రేమించాలని, తమ ప్రేమకు అడ్డురావద్దంటూ జానకిరామ్‌ను పలుసార్లు హెచ్చరించాడు. అలాగే ఘర్షణ కూడా పడ్డాడు. కళాశాల లోపల, బయట తరచూ ఇద్దరు ఘర్షణలు పడేవారు. కాగా సోమవారం వంశీరాయల్ గాజులమండ్యం సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో క్రికెట్ పోటీ జరుగుతుందని, రమ్మని జానీని పిలిచాడు. జాని తన
మిత్రుడు ఢిల్లీతో కలసి సోమవారం ఉదయం క్రికెట్ ఆడే స్థలానికి చేరుకున్నారు. అయితే క్రికెట్ ఆడటానికి ముందే వంశీరాయల్, జానకిరామిరెడ్డి మధ్య ప్రేమించిన అమ్మాయి విషయమై వాగ్వివాదం మొదలైంది. అయితే వంశీరాయల్ తన వద్ద ఉన్న కత్తితో జానకిరామి రెడ్డి నాలుక పట్టుకుని కోసేశాడు. అంతటితో ఆగకుండా అతని గొంతు కోశాడు. దీనిని గమనించిన ఢిల్లీ వంశీరాయల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తితో అతని భుజంపైన పొడిచి, ముఖంపైన కత్తితో గాయం చేశాడు. దీంతో భయకంపితుడైన ఢిల్లీ వారి నుంచి తప్పించుకుని రోడ్డుపైకి పరుగులు తీశాడు. గాయాలతో పరుగులు తీస్తున్న ఢిల్లీని స్థానికులు విచారించడంతో జరిగిన దారుణాన్ని వారికి వివరించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు 108లో జానీని, ఢిల్లీని రుయాకు తరలించారు. జానీ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే అప్పటికే వంశీరాయల్, అతని అనుచరులు 10 మంది అక్కడ నుంచి పారిపోయారు. కాగా వంశీరాయల్ ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే జానీని అక్కడకు రప్పించి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. తిరుపతిలో సీ ఎం జ్ఞానభేరి కార్యక్రమంలో ఉండటంతో పోలీసులు బందోబస్తులో ఉండటంతో నిందితులు సులభంగా తప్పించుకున్నారని అంటున్నారు. జరిగిన దారుణం తెలుసుకుని జానీ చదువుతున్న కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున రుయా మార్చురీ వద్దకు చేరుకున్నారు. గాయాలకు గురైన ఢిల్లీని పోలీసులు విచారిస్తున్నారు.