రాష్ట్రీయం

రాహుల్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కుంతియా, ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్. ఆగస్టు 8: ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13, 14న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నందున, రాహుల్ పాల్గొనే కార్యక్రమాల ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నాయకులు పరిశీలించారు. బుధవారం ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసీసీ కార్యదర్శులు సలీమ్, శ్రీనివాస కృష్ణన్, పీసీసీ కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఎఐసీసీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రాహుల్ దూతలు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా శంషాబాద్ నుంచి రాజేంద్ర నగర్‌లోని క్లాసిక్ గార్డెన్ వరకు పర్యటించారు. అక్కడ రాహుల్ మహిళా ప్రతినిధులతో చర్చించనున్నారు. అక్కడి నుంచి వారు నేరుగా శేరిలింగంపల్లిలో జరగబోయే బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి, ఏర్పాట్లు చేస్తున్న నేతలకు కొన్ని సూచనలు ఇచ్చారు. అనంతరం పెద్దమ్మ గుడి ప్రాంతాన్ని పర్యటించారు. ఇదిలాఉండగా రాహుల్ గాంధీ పర్యటించే ప్రాంతాల్లో నాయకులు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఇతరత్రా ఏర్పాట్లను వారు సమీక్షిస్తూ నేతలకు సూచనలు ఇచ్చారు.