రాష్ట్రీయం

పోలీసులది ఘోర వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: అనంతపురం జిల్లా తాడిపత్రి చినపొడమాల ఘటనను నియంత్రించడంలో స్థానిక పోలీసులు అట్టర్‌ఫెయిల్ అయ్యారని అధికార టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆన్నారు. తనపై దాడి జరుగుతున్నా.. తన అంగరక్షకులు పారిపోయారే గానీ, కనీసం గాలిలో కాల్పులు జరపలేదని మండిపడ్డారు. ప్రబోధానంద స్వామి ఓ దొంగని, గతంలో కూడా హత్య కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని, ఆయన ఆశ్రమంలో దురాగతాలు బయటకు వస్తున్నాయని అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ తన 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క రాయి కూడా తనపై పడలేదని, కాని దొంగ బాబా ఆశ్రమం ఘటనలో తనపై దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. ప్రబోధానంద డేరాబాబాని మించిపోయాడని, స్థానిక మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారని, ఈఘటనకు సంబంధించి ముఖ్యమంత్రికి అన్ని వివరాలు వెల్లడించానని చెప్పారు. ప్రబోధానంద స్వామీజీ దేవుళ్ళను ఉద్దేశించి చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్‌లను, స్వామీజీ వల్ల మోసపోయామంటున్న బాధితుల కథనాలను ప్రబోధానందకు అనుకూలంగా జగన్ మాట్లాడిన క్లిప్పింగులను ఈ సందర్భంగా జేసీ ప్రదర్శించారు.