తెలంగాణ

కొండగట్టు సాయానికి ఈసీ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందింది. కొండగట్టు ప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.5 లక్షలు, క్షతగ్రాతులకు రూ.2.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ సహాయాన్ని అందించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి నివేదించారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.