రాష్ట్రీయం

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఆదివారం తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజశ్యామల యాగం నిర్వహించారు. రెండు రోజులపాటు జరుగనున్న ఈ యాగం సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతితో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాజశ్యామల యాగంలో భాగంగా సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, అన్ని గ్రహాలకూ హోమాలతో పాటు చండీయాగం నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ భార్య శోభ, ఇతర ఇతర కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.