రాష్ట్రీయం
ఎన్నికల ఘర్షణ కేసులో 90 మందికి 6 నెలల జైలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 March 2016
గూడూరు టౌన్, మార్చి 28: ఓ ఘర్షణ కేసులో ఇరు వర్గాలకు సంబంధించి నమోదైన కేసులో 90 మందికి ఆరు నెలల జైలు, 10 వేలరూపాయల వంతున జరిమానా విధిస్తూ గూడూరులోని అడిషనల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిరాం సోమవారం తీర్పు వెలువరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొదలకూరు మండలం సూరాయ పాలెం గ్రామంలో 2000వ సంవత్సరం జూలై 19 ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బొల్లినేని కృష్ణయ్య, స్వతంత్ర అభ్యర్థిగా కొమ్మి లక్ష్మయ్య నాయుడులో పోటీ చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో అప్పుడు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు.