రాష్ట్రీయం

ప్రత్యేక రైలులో తిరుపతికి కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి తిరుపతికి ప్రత్యేక ట్రైన్‌లో వెళ్లనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చెప్పారు. శాసనసభలో మంగళవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మొక్కులు చెల్లించుకోవడానికి తాను ఒక్కడినే కాకుండా పది జిల్లాల నుంచి ప్రజలను తీసుకెళ్తానని, అందుకోసం ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అన్నారు. తిరుపతికే కాకుండా అజ్మీర్‌కు కూడా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటామన్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అజ్మీర్ వెళ్లి వసతి సౌకర్యాలపై చర్చించి వచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు.