రాష్ట్రీయం

రాష్ట్రంలో నూతన పార్టీ ఆవిర్భావానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంగనూరు, జనవరి 17: రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలోకి అడుగు పెడుతున్నాని పారిశ్రామిక వేత రామచంద్రయాదవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఆయన నివాసంలో విలేఖర్ల సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో వైకాపా, టీడీపీ , బీజేపి, కాంగ్రెస్, జనసేన పార్టీలకు దీటుగా యువనాయకత్వంలో నూతన పార్టీ పురుడు పోసుకోనుందన్నారు. త్వరలోనే విజయవాడలో తమ పార్టీ ఆవిర్భావం, నామకరణం ఆవిష్కరిస్తామని రామచంద్రయాదవ్ తెలిపారు. తాను పుంగనూరు వాసినని ఈప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమే తాను రాజకీయాలోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈకార్యక్రమంలో న్యాయవాది వెంకటముని, చంద్రారెడ్డియాదవ్, బిసి సంఘ నేత అద్దాల నాగరాజ తదితరులు పాల్గొన్నారు.