రాష్ట్రీయం

21 నుంచి కేసీఆర్ చండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక కళ్యాణం కోసం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం చేయాలని సంకల్పించారు. ఈ మేరకు తన వ్యవసాయ క్షేత్రం (ఫాం హౌస్)లో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ చండీ యాగంలో ప్రధానంగా పాల్గొంటారు. ఇంకా కుటుంబ సభ్యులతో మాత్రమే నిర్వహించాలని భావించారు. అయితే ఎందుకో కానీ చివరి నిమిషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లు సమాచారం. గతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభృతులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా ఈసారి రాజకీయ నాయకులను ఆహ్వానించకుండా కేవలం కుటుంబ సభ్యులతో, తనకు సన్నిహితంగా ఉండే పార్టీ రాష్ట్ర నాయకులను పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ వైఎస్ జగన్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇలాఉండగా గతంలో నిర్వహించిన ఆయుత చండీ మహాయాగం తరహాలో ఈ దఫా కూడా శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో శృంగేరి శారదాపీఠం సంప్రదాయంలో ఈ మహాయాగాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ యాగంలో 200 మంది ఋత్వికులు
పాల్గొంటారు. సహస్ర చండీ యాగంలో మొదటి రోజు సప్తశతి చండీ పారాయాణాలు నిర్వహిస్తారు. రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయాణాలు నిర్వహిస్తారు. ఇలా మొత్తం వెయ్యి పారాయాణాలు పూర్తి చేస్తారు. ఐదవ రోజున ఏకాదశ యజ్ఞ కుండాల వద్ద వంద పారాయాణాలు, స్వాహకారాలతో హోమం నిర్వహించి, ఆ తర్వాత పూర్ణాహుతితో యాగం పరిసమాప్తి అవుతుంది. మహారుద్ర యాగంలో నాలుగు రోజులూ రుద్ర పారాయాణాలు, చివరి రోజు రుద్ర హవనం పూర్ణాహుతి జరుగుతుంది. ఈ యాగానికి వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, ధర్మాచార్యులు, స్వామిజీలు, అథ్యాత్మిక, థార్మికవేత్తలు, వేద పండితులు, ప్రముఖులను ఆహ్వానించనున్నారు.