రాష్ట్రీయం

‘పోలవరం’లో పట్టిసీమ అంతర్భాగం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. న్యాయవాది శ్రవణ్ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్ర జలవనరులశాఖ అమోదించిన సమగ్ర పాజెక్టు నివేదికలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం లేదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోకుండా పట్టిసీమ పథకానికి నిధులు కేంద్రం అందిస్తుందా అన్న ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ నిధులు ఇవ్వలేం అని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకు 2013-14 సంవత్సరాలలో ఎఎడిపి కింద రూ.562.47 కోట్లు కేంద్రం ఇచ్చిందని, 2014లో పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ.250 కోట్లు విడుదల చేసినట్లు అందులో పేర్కొంది.