రాష్ట్రీయం

నేడు రథసప్తమికి భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి పర్వదినం నిర్వహణకు టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనుండడంతో అందుకు తగ్గట్టు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూరె్తైన తరువాత ఉదయం 4.30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహన మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవ మొదలవుతుంది. చిన్న శేషవాహనం ఉదయం 9 నుండి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుండి 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు జరుగుతుంది. అనంతరం చక్రస్నానం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహన సేవలు కనుల పండువగా జరగనున్నాయి. ఒకేరోజు సప్త వాహన సేవలు జరగనుండడంతో భక్తులు తరలివస్తున్నారు.