ఆంధ్రప్రదేశ్‌

బాలుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 19: శ్రీ కాళహస్తి పట్టణంలో మంగళవారం అమానుషం వెలుగుచూసింది. పట్టణంలోని స్వర్ణముఖి నదిలో లగేజి బ్యాగులో సుమారు ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాగును తెరచి అవాక్కయ్యారు. సుమారు ఏడేళ్ల వయసున్న పిల్లవాడి మృతదేహాన్ని చూసి అక్కడున్నవారంతా చలించిపోయారు. మెడకు నైలాన్ దారం కట్టి ఉరివేసి హత్యచేసి దుప్పటిలో చుట్టి లగేజి బ్యాగులో పెట్టి స్వర్ణముఖి నదిలో పడేసిన వైనం అందర్ని కలిచివేసింది. అయితే మృతిడి వివరాలు తెలియడం లేదు. ఏ ప్రాంతం వాడో కూడా పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. కప్పిన దుప్పటి చూసి హాస్టల్ విద్యార్థిగా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రం కాబట్టి లాడ్జీలు ఎక్కువగా ఉండటం వలన ఆ లాడ్జీలకు సంబంధించిన దుప్పటి గా ఉండవచ్చునని మరో అనుమానం వ్యక్తమవుతోంది. వివరాలేవీ తెలియకపోవడంతో పోలీసులు హైరానా పడుతున్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే స్థానికులు తండోపతండాలుగా వెళ్లి బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరుకారుస్తున్నారు. అయితే ఎవ్వరూ గుర్తుపట్టడం లేదు. యాత్రికులెవ్వరైనా వచ్చి కుటుంబ కలహాల కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలు, లేదా ఆస్తి తగాదాల వల్ల బాలుడ్ని చంపారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకొని పరిశోధిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి వన్ టౌన్ సి ఐ చిన్నగోవిందు, ఎస్ ఐ ప్రవీణ్‌కుమార్ బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.