రాష్ట్రీయం

కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరితారెడ్డి పోటీ చేయనున్నారు. ఆమె రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి. పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరెడ్డి కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. పాలేరు అభ్యర్థి ఎంపికపై శనివారం టిపిసిసి కార్యవర్గ సమావేశం చర్చించింది. సుచరితకే టికెట్ ఇవ్వాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఎఐసిసి దృష్టికి తీసుకువెళ్దామని కార్యవర్గం భావించినట్టు పార్టీ నేతలు మల్లు రవి, నాగయ్య విలేఖరులకు తెలిపారు. కాగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పాలేరు ఎన్నికపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమ వినతి మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుని తమకు మద్దతునివ్వడం సంతోషకరమని అన్నారు. టిటిడిపి అభ్యర్థిగా మాజీ ఎంపి నామా నాగేశ్వర రావు పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోందని, అయితే ఆ పార్టీని కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా ఉత్తమ్‌కుమార్ కోరారు. కాగా అభ్యర్థి విషయమై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.