రాష్ట్రీయం

టిప్పర్- ఆటో ఢీ పది మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, మే 14: ఆదిలాబాద్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ఇటుకబట్టీ కార్మికులు. సారంగాపూర్ సమీపాన ఆరెల్లి మహాపోచమ్మ ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు 14మంది కార్మికులు శనివారం పొద్దుపోయాక సెవెన్ సీటర్ ఆటోలో బయలుదేరారు. బాసర-్భంసా రహదారిలో పడ్గాం గ్రామ సమీపాన ఎదురుగా కంకరలోడ్‌తో వస్తున్న టిప్పర్ వీరి ఆటోను ఢీకొంది. ఈ దుర్ఘటనలో టిప్పర్‌లోని కంకర అంతా ఆటోమీద పడటంతో లోపల ఉన్న పది మంది కార్మికులు ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. చావుబతుకుల మధ్య ఉన్న నలుగురిని స్థానికులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.