ఆంధ్రప్రదేశ్‌

మండల ఉపాధ్యక్షుడు దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, మే 15: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు గోపు సతీష్‌రాజా (38) దారు ణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కత్తులతో నరికి చంపారు. మండలంలోని తాటిపర్తికి చెందిన సతీష్‌రాజా ఆదివారం రాత్రి సమీపంలోని దివిలి సెంటర్‌లోని ఒక షాపువద్ద ఉన్న సమయంలో, ఆయనపై ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు కత్తులతో దాడిచేశారు. ప్రాణభయంతో పరుగు తీసిన ఆయనను సుమారు అర కిలోమీటరు దూరం వరకు తరిమి తరిమి విచక్షరహితంగా నరికివేయడంతో అక్కడిక్కడే మృతిచెందారు. దాడిలో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం హంతకులు పరారయ్యారు. మృతిచెందిన సతీష్‌రాజాకు భార్య, కుమార్తె ఉన్నారు. కాగా హత్య సమాచారం అందుకున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పెద్దాపురం డిఎస్పీ రాజశేఖర్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.