రాష్ట్రీయం

సైకిలెక్కనున్న ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 31: ప్రకాశం జిల్లాలో వైకాపాకు చెందిన గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అదేవిధంగా కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈనేపధ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గం నుండి పోతుల సైకిల్ ఎక్కనుండడంతో అక్కడ ఇప్పటివరకు పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న దివి శివరాం ఏ మేరకు పోతులతో సఖ్యతగా ఉంటారో వేచి చూడాలి.