రాష్ట్రీయం

ప్రజాసేవకు టిడిపి వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 2: ప్రకాశం జిల్లా కందుకూరు వైకాపా ఎమ్మెల్యే పోతిన రామారావు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో రామారావుకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు తదితరులు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కాపులను రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. అలాగే మిగిలిన అగ్రవర్ణాల్లో కూడా ఉన్న పేదలను ఆదుకుంటామని చెప్పారు. ఇప్పుడు తనకు రాజకీయం ముఖ్యం కాదని, అందరితో కలిసి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. తన పదవీ కాలంలో 80 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని, ఇదే జరిగితే, వచ్చే ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్లు కూడా రావని అన్నారు.ప్రజాసేవ చేయాలనుకున్న వారికి టిడిపి ఒక వేదిక అని, సేవ చేయాలనుకున్న వారంతా పార్టీలోకి రావచ్చని అన్నారు.

చిత్రం కందుకూరు ఎమ్మెల్యే రామారావుకు పచ్చకండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు