రాష్ట్రీయం

నైరుతి పలకరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 9: కేరళ తీరాన్ని బుధవారం తాకిన నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమించి గురువారం నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని పలకరించాయి. ఇవి అనంతపురం, ఒంగోలు వరకూ విస్తరించినట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ఇవి విస్తరించాయి. శుక్రవారం నాటికి కోస్తా, రాయలసీమల్లో మరింతగా విస్తరించవచ్చునని తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని తెలిపారు. కాగా ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ కోస్తా వరకూ ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండటం వల్ల రుతుపవనాలు మరింత బలంగా త్వరగా విస్తరించేందుకు వీలు కలుగుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ శాస్త్ర నిపుణుడు ఆచార్య ఒఆర్‌ఎస్‌డి భానుకుమార్ తెలిపారు. వారం రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇవి బలంగా ఉండటం కలిసి వచ్చే అంశమన్నారు.