రాష్ట్రీయం
తిరుమలలో బారులు తీరిన భక్తులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 June 2016
తిరుమల, జూన్ 12: తిరుమలలో ఆదివారం కూడా రద్దీ కొనసాగింది. వారాంతపు, వేసవి చివరి సెలవులు కావడంతో భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో గత మూడు రోజులుగా ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు వచ్చిన భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉండటంతో సోమవారం రద్దీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా తిరుమలలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి ఇఒ సాంబశివరావు, జెఇఒ శ్రీనివాసరాజు తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు తగు సూచలను జారీ చేశారు.