రాష్ట్రీయం

ఇక్కడ లీడర్ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణలో పార్టీని నడిపించే నాయకుడు ఎవరు? ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను రూపొందించుకుని జిల్లా పర్యటనలకు వెళుతున్నారు? మేము ఎవరి నాయకత్వంలో పని చేయాలి? అని టి.టిడిపి నాయకుడు ఒకరు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. సోమవారం నగరంలోని లేక్‌వ్యూ అతిథి గృహంలో చంద్రబాబు టి.టిడిపి నేతలతో సమావేశమై పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. దీంతో ఒక నాయకుడు పార్టీలో సమన్వయం లోపిస్తున్నదని, తమకు పార్టీ కార్యక్రమాల గురించి చెప్పే నాధుడే లేరని, ఎవరికి వారే జిల్లా పర్యనలకు వెళుతున్నారని, మీడియా సమావేశాలు నిర్వహించుకుంటున్నారని ఏకరువు పెట్టారు. విషయం అర్థం చేసుకున్న చంద్రబాబు స్పందిస్తూ ఇకమీదట అలా జరగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యాచరణను రూపొందించడం, వాటి గురించి పార్టీ నాయకులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు సమాచారం చేరవేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూడాలని ఆయన రమణకు, రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ‘ముందడుగు’ వేయాలని, ఎవరికీ భయపడేది లేదని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో పార్టీ మరింత బలపడాలంటే మీరు తరచూ రావాలని, ఎన్నికల వరకూ అప్పుడప్పుడు జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు. మీరు వస్తేనే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో, కార్యకర్తల్లో మనోధైర్యం కలుగుతుందని వారన్నారు. అందుకు చంద్రబాబు ప్రతిస్పందిస్తూ తాను ఎప్పుడైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాష్ట్ర విభజనకు ముందు తనకు తెలంగాణ-ఆంధ్ర రెండు కళ్ళవంటివని అన్నానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని, నాయకులు పార్టీ కార్యాలయానికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యం, సాగు నీరు అందిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం వంటి అంశాలపై ఆందోళనలు చెద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాఉండగా మే నెలాఖరున నిర్వహించిన మహానాడు, మిని మహానాడుల్లో పార్టీ చేసిన తీర్మానాలు, వాటి అమలుపై కూడా ఈ సందర్భంగా వారు చర్చించారు.

చిత్రం తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమై ప్రాధాన్యతా అంశాలపై చర్చిస్తున్న సిఎం చంద్రబాబు