రాష్ట్రీయం

మార్కెటింగ్ శాఖ వచ్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 13:హెచ్‌ఓడిల తరలింపు మొదలైంది. గుంటూరు మార్కెట్ యార్డులో మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఉద్యోగినులతో సహా 50 మంది డైరెక్టరేట్ ఉద్యోగులు ఫర్నిచర్ సహా చేరుకున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో స్థిరపడిన తమ అనుభవాలను గుర్తుచేసుకుంటూ సొంత రాష్ట్రంలో విధుల నిర్వహణ ఆనందంగా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తు పట్లే బెంగగా ఉందని ఉద్యోగినులు ‘ఆంధ్రభూమి’కి వివరించారు. గుంటూరు మార్కెట్ యార్డు ఆసియాలోకెల్లా అతిపెద్దది. సుమారు 56 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో దేశ, విదేశీ మిర్చి ఎగుమతులకు అనువైన ఫ్లాట్‌ఫారాలు, కార్యాలయాలు ఉన్నాయి. వ్యవసాయ శాఖకు అనుబంధంగా వ్యవసాయ, మార్కెటింగ్ కార్యాలయాలను మాత్రం యార్డుకు తరలించి ఫిషరీస్, సహకార విభాగాలను విజయవాడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.