రాష్ట్రీయం

బదిలీ భారం కాదు... బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సంతృప్తి గీటురాళ్లుగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వ పరిపాలనలో ముఖ్య భూమిక పోషించే ఉద్యోగ వ్యవస్థనుంచి ఉత్తమ బృందాలను ఎంపిక చేయడం కోసమే బదిలీల ప్రక్రియ చేపట్టామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగితో పనిచేయించుకోక తప్పదని, క్రమశిక్షణ, బాధ్య త మరచిన ఉద్యోగులను పక్కనపెట్టడం కూడా అవసరమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగులు అందరూ సమానమేనని, అందరినీ సమ దృష్టితోనే చూస్తూ బదిలీ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్యోగస్తులెవరూ బదిలీని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు, కార్యదర్శులు, మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ఈ రెండు రోజులు సమన్వయంతో పనిచేసి బెస్ట్ టీమ్స్ ఎంపికపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల్లో బదిలీ ప్రక్రియ మొత్తం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బదిలీ ప్రక్రియ ఇంతవరకు చేపట్టని ఆరోగ్య శాఖ, మరో రెండు రోజులు గడువు అడుగుతున్న విద్యా శాఖ తక్షణం బదిలీ ప్రక్రియను చేపట్టి అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖలో బదిలీలను ఆగస్టు మాసంలో ఆరంభించి పూర్తి చేస్తామని తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైనందున విద్యా శాఖలో బదిలీలను ఇంతకుముందే పూర్తి చేసి ఉండాల్సిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఒకసారి బదిలీ జరిగితే మూడేళ్లు తమను ఎవరూ ముట్టుకోరని ఉద్యోగులు భావించరాదని, సక్రమంగా విధులు నిర్వర్తించని వారిని ఎప్పుడైనా, ఎక్కడికైనా బదిలీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని సమీక్షలో పాల్గొన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

చిత్రం విజయవాడలో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న చంద్రబాబు