రాష్ట్రీయం

పంటకుంటలో మునిగి నలుగురు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 2: స్నానానికి వెళ్లి పంటకుంటలో పడి నలుగురు విద్యార్థులు మృతిచెందిన సంఘటన శనివారం సాయంత్రం గుంటూరు జన్మభూమినగర్‌లో జరిగింది. స్తంభాలగరువు హాస్టల్‌లో 9, 10 తరగతులు చదువుతున్న సంకుల కార్తీక్ (13), నేర్లకంటి రామకృష్ణ (17), దక్షిణామూర్తి ఈశ్వర్ (13), ఒంటెద్దు రవి (12)లతోపాటు మరో ఇద్దరు విద్యార్థులు స్నానం చేసేందుకు సమీపంలోని పంటకుంటలో దిగారు. రేగడినేల కావడంతో తొలుత ఇద్దరు విద్యార్థులు బురదలో చిక్కుకుపోయారు. వీరిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు విద్యార్థులు లోతులో దిగడంతో నలుగురు విద్యార్థులూ మృత్యువాత పడ్డారు.