రాష్ట్రీయం

నిరాకరించిందని నరికేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జూలై 2: ప్రేమ వేధింపులకు 18 ఏళ్ల యువతి బలైపోయంది. ప్రేమిస్తున్నానంటూ ఏడాదిన్నరగా వెంటపడి వేధిస్తూ, శనివారం పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తితో దాడిచేసి హతమార్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసాలోని గోపాల్‌నగర్ కాలనీలో సంచలనం రేకెత్తించింది. డిఎస్పీ అందె రాములు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గోపాల్‌నగర్‌లో నివాసముంటున్న సరోజ, మారుతిల కుమార్తె సంధ్య (18)ను గత కొంతకాలంగా తన ఇంటి సమీపంలోనే ఉంటున్న మేదరి మహేష్ ప్రేమిస్తున్నానంటూ వేధించసాగాడు. సంధ్య నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహానికి గురైన మహేష్ శనివారం ఇంటి నుండి కిరాణా కొట్టుకు వెళ్తున్న సంధ్యను నడిరోడ్డుపై కత్తితో దాడిచేయడంతో సంఘటన స్థలంలోనే కుప్పకూలింది. హత్య సమాచారం అందుకున్న డిఎస్పీ అందెరాములు, సిఐ రఘు, ఎస్సై తిరుపతి, నజీర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హంతకుడు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ అందె రాములు వెల్లడించారు. సంఘటన స్థలంలో వివరాలు సేకరించిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ప్రేమను యువతి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుడి నుండి పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సంధ్య మృతితో కాలనీలో రోదనలు మిన్నంటాయి. మృతురాలి తల్లి సరోజ రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. గత కొనే్నళ్ల క్రితమే తండ్రి అనారోగ్యంతో మరణించడంతో, తల్లి కూలీనాలి చేస్తూ పిల్లలను పెంచుతోంది. కూతురు హత్యకు గురికావడంతో తల్లి రోదనలు మిన్నంటాయ. దోషిని కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు పోలీసులను డిమాండ్ చేశారు. ఏడాదిన్నర క్రితం సంధ్య నిశ్చితార్థాన్ని నిలిపివేసినప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోకపోవడంతో యువకుడు వేధింపులు మానలేదని, దీంతో యువతి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు బాధ్యుడైన యువకుడి కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేశాకే మృతురాలికి పోస్టుమార్టం నిర్వహించాలని కాలనీవాసులు పోలీసులను డిమాండ్ చేశారు.

చిత్రంలు.. కుమార్తె మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి.
హంతకుడు మహేష్