ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా పుష్కరాలకు రజనీకాంత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏపి ప్రభుత్వ అతిథిగా పుష్కరాలకు హాజరుకానున్నారు. కృష్ణా పుష్కరాలకు హాజరుకావాలని బాబు ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా కూడా ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. దానికి స్పందించిన రజనీకాంత్ తాను పుష్కరాలకు వస్తున్నట్లు సమాచారం పంపినట్లు తెలిసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా చింతపల్లిలోని విష్ణు పంచాయతన దివ్య మహాక్షేత్రానికి రజనీకాంత్ హాజరయి, అక్కడ పుష్కరస్నానం చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రంలో ఎలాంటి భారీ కార్యక్రమం జరిగినా బాబు ప్రభుత్వం రజనీకాంత్‌కు ఆహ్వానం పంపిస్తూనే ఉంది. గత గోదావరి పుష్కరాలకూ ఆహ్వానం పంపింది. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు సమయంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి రజనీకాంత్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ రజనీకాంత్‌తో బాబు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.