రాష్ట్రీయం

నరుూం యాక్షన్ టీం ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ తరువాత రాష్టవ్య్రాప్తంగా అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే వీరిని మించిన యాక్షన్ టీం ఒకటి ఉన్నట్టు సిట్ గుర్తించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఏడుగురు సభ్యులతో కూడిన యాక్షన్ టీం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నరుూంతో పాటు అతని నేర సామ్రాజ్యాన్ని కూడా కుప్పకూల్చాలనే ఉద్దేశంతో పోలీసులు వీరిని వేటాడుతున్నారు. ఇప్పటి వరకు నరుూంతో సంబంధమున్న 20 మందికి పైగా అరెస్టు అయ్యారు. వీరంతా ఇప్పటి వరకు వెలుగులోకి రాని సివిల్ నేరగాళ్లని, తెరచాటుగా ఉంటూ నరుూం ఆదేశాల మేరకు పనిచేస్తూ వచ్చారని ఓ సీనియర్ సిట్ అధికారి తెలిపారు. భూ కబ్జాలకు పాల్పడడం, బెదిరింపులతో వసూళ్లు చేయడం, ల్యాండ్ సెటిల్‌మెంట్లలో కీలక పాత్ర పోషించడంతోపాటు నరుూం ఆస్తులకు బినామీలుగా, నరుూం డెన్స్‌కు కేర్‌టేకర్‌లుగా పనిచేశారు. కాగా ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీం ఒకటి నరుూం కనుసన్నల్లో పని చేసింది. కరుడగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులతో కూడిన ఈ టీం నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చురుకుగా పని చేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది. నరుూం ఆదేశాల మేరకు రంగంలోకి దిగడం, హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్‌కు వెళ్లిపోవడం వీరి పని. వీరికి బదులుగా ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీం సిద్ధంగా ఉంటుందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్ టీంకు చెందిన వారి పేర్లు కేవలం కుట్రదారులుగానే ఉంటాయి. ఇంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీం నరుూం ఎన్‌కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిని కూడా అణచివేయకుంటే నరుూం వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం జరగొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఆ ఏడుగురూ అత్యంత కీలకం..
నరుూం యాక్షన్ టీంలో ఏడుగురు వ్యక్తులు అత్యంత కీలకమని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపి, పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న ఈ యాక్షన్ టీంలో అత్యంత కీలకం. ఇతనితోపాటు మహబూబ్‌నగర్‌కు చెందిన చెన్నారం రాజు, అచ్చంపేటకు చెందిన జహంగీర్, సిద్దిపేటకు చెందిన ముల్కపురం మహేశ్ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన దామోదర్‌రెడ్డి (ఇతడి సోదరుడు వెంకటరెడ్డిని పటోళ్ల గోవర్దన్‌రెడ్డి హత్య చేశాడు) హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఆసిఫ్, పాతబస్తీకి చెందిన ఫిరోజ్ యాక్షన్ టీంలో ప్రధాన సభ్యులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరితోపాటు వీరి కనుసన్నల్లో పనిచేసిన, చేస్తున్న సుపారీ మనుషుల జాడ కూడా కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
కాగా, గ్యాంగ్‌స్టర్ నరుూం హంతక ముఠా సభ్యులను అరెస్టు చేయాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. నరుూం రాజ్యం తయారు చేసిన ఓ ఆయధమని ఆయన పేర్కొన్నారు.