ఆంధ్రప్రదేశ్‌

థాంక్యూ సిఎం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: కృష్ణా పుష్కరాలను అద్భుత రీతిలో నిర్వహించి ప్రజా మన్ననలు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక దుర్గా ఘాట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంగళవారం ప్రజా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి సభా వేదికపైకి వచ్చి ఆశీనులైన సందర్భంలో ఎమ్మెల్యేలందరూ థ్యాంక్యూ సిఎం అనే సిఎం ముఖ చిత్రంతో ముద్రించిన పోస్టర్లను పైకెత్తి మూడు సార్లు థ్యాంక్యూ సిఎం అంటూ నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పుష్కరాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా 99 శాతం పైగా ప్రజల నుండి అభినందనలను, ప్రశంసలను పొందడం చంద్రబాబుకే దక్కిందని పయ్యావుల కేశవ్ నేతృత్వంలోని ప్రజా ప్రతినిధులు ముక్తకంఠంతో హర్షాతిరేకాలు తెలియజేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి లభించని అరుదైన సంఘటనకు కమాండ్ కంట్రోల్ రూమ్, దుర్గాఘాట్ వేదికైంది. ఈ సమావేశంలో పరిపాలనాపరమైన రాష్ట్ర ప్రతిష్ఠను పెంచిన ప్రత్యేకాధికారి బి.రాజశేఖర్, కృష్ణా కలెక్టర్ బాబు.ఎతో పాటు గుంటూరు, కర్నూలు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర డిజిపి ఎన్.సాంబశివరావు బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఉన్నతస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.