రాష్ట్రీయం

అత్యంత వైభవంగా అతిరుద్ర మహాయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 23: తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామలో అతిరుద్ర మహాయజ్ఞం నాలుగో రోజైన బుధవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం సంకల్పం, నిత్యపారాయణ, ఏకాదశ రుద్రాభిషేకాలు, సూర్య నమస్కారాలు నిర్వహించారు. గురువందనం, వేద పారాయణం, గురు ప్రార్థన, మహన్యాసం, రుద్రాభిషేకం తదితరాలను రుత్విక్కులు నిర్వహించారు. సాయంత్రం లక్ష బిల్వార్చన నిర్వహించారు. కాగా యజ్ఞశాల వద్ద శ్రీశ్రీశ్రీ విజయేశ్వరీదేవి కరుణామయి అమ్మ ప్రత్యేక అర్చన నిర్వహిస్తున్న సమయంలో శివలింగం వద్ద ఒక కాంతి పుంజం ఏర్పడటాన్ని గమనించిన భక్తులు హరహర మహాదేవ శంభో నినాదాలతో యజ్ఞశాలను హోరెత్తించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మాత విజయేశ్వరీదేవి