రాష్ట్రీయం

26న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబరు 16: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 26న పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగ జరిపేందుకు శ్రీకారం చుట్టింది.
ఈ రాకెట్ ద్వారా మన దేశానికి స్క్యాట్‌శాట్-1 ఉపగ్రహంతో పాటు విద్యార్థులు రూపొందించిన మరో చిన్న రెండు ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు కలిపి మొత్తం ఎనిమిది ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక వద్ద రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. సోమవారం ఉపగ్రహాన్ని రాకెట్ చివరి భాగంలో అమర్చి ప్రయోగానికి సిద్ధం చేయనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఎంఆర్‌ఆర్ సమావేశం ఈ నెల 20న జరగవచ్చునని ఇస్రో వర్గాల నుండి సమాచారం. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 26న సాయంత్రం 4గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది.