రాష్ట్రీయం

ఐదేళ్ల బాలుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, సెప్టెంబర్ 24: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని న్యూసిటీ కాలనీలో శనివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడిని అతిదారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన కలకలరేపింది. కొత్తూరు మండలం చంద్రయనిగూడకు చెందిన డ్రైవర్ యాదయ్య, అతని భార్య మంజుల, వారి ఐదేళ్ల కుమారుడు శ్రీనాథ్, మరో ఇద్దరు కుమార్తెలు షాద్‌నగర్ పట్టణంలో న్యూసిటీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న యాదయ్య మొదటి భార్య బంధువులు శనివారం రాత్రి షాద్‌నగర్‌కు వచ్చి ఆస్తి విషయంలో తగాదా పడ్డారు. వారి మధ్య మాటామాట పెరిగి యాదయ్య కుమారుడు శ్రీనాథ్‌ను మొదటి భార్య బంధువులు అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పిల్లాడిని హత్య చేయడంతో పెద్దగా కేకలు వేసిన యాదయ్య, మంజుల మరో ఇద్దరు కుమార్తెలు ఇంట్లో నుండి బయటికి వచ్చి కాపాడాలంటూ రోదిస్తూ పెద్దగా కేకలు వేశారు. వెంటనే చుట్టుపక్కల వారు అక్కడి వస్తున్న విషయాన్ని గమనించిన దుండగులు పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు షాద్‌నగర్ ఎస్సై విజయాదిత్య సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నామని, బాలుడిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు.