రాష్ట్రీయం

ప్రతిభకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 25: ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందు కు బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కె ప్రసాద్ వెల్లడించారు. ఆదివారం వేకువజామున ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిభ, నైపుణ్యం కలిగి ఉంటే ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన తరువాత మొదటిసారిగా తిరుమలకు విచ్చేసినట్లు తెలిపారు. టీం ఇండియా భవిష్యత్తు కార్యాచరణపై సీనియర్ ఆటగాళ్లతో చర్చించి ప్రణాళికలను రూపొందించుకోనున్నామని తెలిపారు. ఇక రానున్న మ్యాచ్‌లో టీం ఇండియా రాణించాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.