రాష్ట్రీయం

అది బంగారు లడ్డూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌కు మహర్దశ కల్పించడమే లక్ష్యంగా కేంద్రం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లా బిజెపి నాయకులు శనివారం తిరుపతిలో ఆయనకు సన్మానసభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి వెంకయ్య మాట్లాడుతూ విభజన చట్టానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను తాను నిలదీసిన విధానాన్ని వివరించారు. మధ్యలో పిట్టకథలు చెబుతూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువచేసే ప్రాజెక్టులను మంజూరుచేసిందో, వాటికి పునాదిరాయి ఎలా వేసిందో వివరించారు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో అవకాశాలను పరిశీలించాలని, పదేళ్లలోపు చేయాలని చెప్పిందే తప్ప నిర్దుష్టంగా చేయమని చట్టాల్లో ఎక్కడా పొందుపరచలేదని ఆయన తనవద్ద ఉన్న ఆధారాలను సభకు చదివి వినిపించారు. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించిన మీదట ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజితోనే ఆంధ్రరాష్ట్రం అభివృద్ధిచెందుతుందని భావించి కేంద్రం నిర్ణయం తీసుకొని బంగారు లడ్డులాంటి ప్యాకేజి ఇచ్చిందన్నారు. అయితే ఆ ప్యాకేజి పాచిపోయిన లడ్డూలా కొంత మందికి ఎందుకు అనిపించిందో తనకు అర్థం కావడంలేదని ఆయన పరోక్షంగా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌కు 2.25 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడంలో కీలక పాత్ర వహించిన వెంకయ్యనాయుడుకు తిరుపతిలో బిజెపి కార్యకర్తలు 225 కేజీల లడ్డూను బహూకరించారు.

చిత్రం.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు తిరుపతిలో 225 కేజీల లడ్డూను బహూకరిస్తున్న పార్టీ నేతలు