రాష్ట్రీయం

సాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని శనివారం ఫోన్‌లో కేంద్ర మంత్రికి వివరించారు. వౌలిక సదుపాయాలకు, పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి చర్చించారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నివేదికను పరిశీలించారు. ఆ నివేదిక కేంద్రానికి అందిస్తామని, తగిన సహాయం చేయాలని ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, రాజీవ్ శర్మ ఆదివారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదికను అందజేస్తారు.
సంతాపం
పిల్లవాగులో కారు కొట్టుకు పోయి మృతి చెందిన వారి కుటుంబానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలంలోని కరెగావ్ గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.