రాష్ట్రీయం

వాగులోకి పల్టీకొట్టిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 6: నిజామాబాద్ నుండి భద్రాచలంకు వెళ్తుండగా గురువారం ఒక కారు ఖమ్మంజిల్లా టేకులపల్లి మండలం ఆరవ మైలు తండా వద్ద అదుపు తప్పి వాగులో పడిపోవడంతో ఇద్దరు యువకులు మృతిచెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ప్రభాకర్ (25), విజయ్ (25) ఉండగా హరికృష్ణ, స్వామిగౌడ్‌లు గాయపడిన వారిలో ఉన్నారు. వాగులో కారుపల్టీ కొట్టిన సమయంలో అదే దారివెంట వస్తున్న ఇల్లందు ఎస్‌ఐ సతీష్, టేకులపల్లి యువకులు బాదావత్ రామకృష్ణ, జాటోత్ బాబురావులు చూసి వెంటనే వెళ్లి కారు అద్దాలు పగులగొట్టే సమయానికే ప్రభాకర్, విజయ్‌లు మృతి చెందారు. గాయపడిన హరికృష్ణ, స్వామిగౌడ్‌లను వెంటనే కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కారును క్రేన్ సహాయంతో బయటకు తీసి టేకులపల్లి ఎస్‌ఐ సంపత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.