రాష్ట్రీయం

సచివాలయంపై దోమల దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: రాజధాని ప్రాంతం ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకవైపు దోమలపై దండయాత్ర సాగిస్తుంటే మరోవైపు దోమల బెడదతో సచివాలయం సిబ్బంది హడలిపోతున్నారు. చుట్టుపక్కల పంట పొలాలు, కొండవీటివాగు పరిసరాల ప్రభావంతో సాయంత్రం 4 గంటల నుంచే దోమలు సచివాలయంపై దాడికి దిగుతున్నాయి. తలుపులు బిగించుకుని పూర్తిస్థాయిలో ఏసి వినియోగిస్తున్నప్పటికీ దోమల బెడదను తట్టుకోలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. ఇలాంటి దోమలను తామెక్కడా చూడలేదని, పురుగుల సైజులో దోమలు విహారం చేస్తున్నాయన్నారు.