ఆంధ్రప్రదేశ్‌

షిర్డిసాయి దైవంకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,అక్టోబర్ 19:షిర్డి సాయి దైవం కాదు సైతాన్ అని ఉత్తరాయణ బదిరి జ్యోతి పీఠం, ద్వారక శారదపీఠం పీఠాధిపతి స్వరూపనందా సరస్వతి మహారాజ్ మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఒంగోలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూత,ప్రేతాత్మలను వదిలేసే విధంగా షిర్డి సాయిబాబా సన్నిధిలో చేస్తారన్నారు. ఇదేవిషయాన్ని షిర్డిసాయి సంస్ధాన్‌వారిని సాయిబాబా దేవుడుకాదని, సైతాన్ అని ఛాలెంజ్ చేశామన్నారు. ఈసంఘటన జరిగి రెండునెలలు కావస్తున్న ఇంతవరకు ఆ సంస్ధాన్‌నుండి ఎలాంటి విషయం వెల్లడి కాలేదన్నారు. శాస్త్రాలకు విరుద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇకనుండి తెలుగుప్రజలెవ్వరు షిర్డివెళ్ళవద్దని పిలుపునిచ్చారు. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునేందుకు షిర్డిసాయిసంస్ధాన్ ఉపయోగపడుతుందేతప్ప మరొకటి కాదన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు త్వరలో షిర్డిలో సుదర్శన చక్ర దేవస్థానం నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. అన్నీ తెలిసిన ఆగమపండితులు సాయి విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు కేవలం ఆగమ పండితులను తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికలకు ముందు పలుసభల్లోతాను అధికారంలోకి వచ్చిన వెంటనే గోవధ జరగకుండా పూర్తిస్ధాయిలో గోవులను సంరక్షిస్తానని చెప్పిన మాటను తప్పారన్నారు.