రాష్ట్రీయం

ఆర్‌కెకి తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అక్టోబర్ 24: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు బెజ్జంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత రామకృష్ణ (ఆర్‌కె) త్రుటిలో తప్పించుకున్నట్టు తెలిసింది. మావోయిస్టుల ప్లీనరీలో పాల్గొనేందుకు ఆర్‌కె కూడా రావాల్సి ఉంది. మరికాసేపట్లో ఆయన సమావేశ స్థలానికి చేరుకోనుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. అయితే ఆయన కుమారుడు, 21 ఏళ్ల మున్నా మాత్రం హతమయ్యాడు. ఏఓబి ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మున్నా అలియాస్ అక్కిరాజు శివాజీ 2009లో ఉద్యమంలో చేరాడు. అతనిపై రెండు లక్షల రివార్డు ఉంది.