రాష్ట్రీయం

ఉలిక్కిపడ్డ పైపల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తవణంపల్లె, అక్టోబర్ 24: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం గ్రామ పంచాయతీ పైపల్లె గ్రామానికి చెందిన చలపతి మరణించటంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. పైపల్లె గ్రామానికి చెందిన శివలింగారెడ్డి కుమారుడు మావోయిస్ట్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ చలపతి (57). వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ప్రతాప్‌రెడ్డి మత్యం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోప్రాథమిక విద్యను, బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆ తరువాత నక్సలైట్లతో ఆయనకు పరిచయం ఏర్పడింది. నక్సల్స్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ప్రతాప్‌రెడ్డి ఉద్యోగాన్ని, కుటుంబ సభ్యులను వీడి నక్సలైట్ల దళంలో చేరిపోయాడు. నాటి నుంచి 35 ఏళ్ల పాటు మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు.