రాష్ట్రీయం

రెండు డిఏ బకాయలు మంజూరు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి, జూలైలో ఇవ్వాల్సిన రెండు డిఏలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) ఎపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మూడు నెలల ముందే డిఏ విడుదల చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదని, ఈ నెల 30న జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని కోరారు. అంగన్‌వాడీ టీచర్లను తొలగించవద్దని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలను తొలగించాలన్న జీవోను వెంటనే నిలిపివేయాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును కాలరాయటమేనని అన్నారు.