రాష్ట్రీయం

షిర్డీకి హిందువులు వెళ్లవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ బేగంపేట, అక్టోబర్ 25: షిర్డీసాయి దేవుడు కాదు..అతనొక ముస్లిం అని, ముస్లింలకు సాయి పూజలు నిలిచిపోవాలి, హిందువులు ఎవ్వరూ సాయిని పూజించవద్దని, సాయి మందిరం శ్మశాన వాటిక, అక్కడికి హిందువులు ఎవ్వరూ వెళ్లొద్దని, సాయిబాబ భూతమని జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామి మరోసారి సంచన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న దిగ్విజయ యాత్రలో భాగంగా మంగళవారం నగరంలోని బేగంపేటలో తన శిష్యబృందంతో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మానవుడి శక్తి జీవించినంతవరకు నిశ్చలంగా ఉంటుందని మరణం తర్వాత శక్తిహీనుడై ఏ జన్మ కోసం విచారిస్తాడో ఎవరికీ తెలియదని తెలిపారు. అపూజ్యులను పూజిస్తే కరవు కాటకాలు తాండవిస్తాయన్నారు. సాయి చమత్కారి అయితే అతని ద్వారా స్వాతంత్య్రం ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. సాయి సంస్థాన్ పురాణాలలో సాయి ముస్లిం అని తేలిందని స్వామి చెప్పారు.
సాయిలో గురు లక్షణాలు లేనందున సనాతన ధర్మ ప్రపంచంలో అతనికి గుర్తింపు లేదన్నారు. సృష్టిలో నీరు ఎంత ముఖ్యమో జీవించడానికి పాలు అంత ముఖ్యమని, పాలు గోవు ద్వారా లభ్యమవుతున్నాయన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పండే పంటలకు తగిన ఎరువు కూడా ఆవు పంచకముల ద్వారా లభిస్తున్న నేపథ్యంలో గోవును రక్షించుకోవాలని స్వామి పేర్కొన్నారు. గోహత్య మానవ హత్యేనని, గోమాంసం ఎగుమతితో దేశం ముందుకు వెళ్తుందని, గోహత్య నిషేదాన్ని రాజ్యాంగం చట్టబద్ధం చేయాలన్నారు. పరమాత్ముడి అనుగ్రహంతో లభ్యమైన బుద్ది ద్వారా మోక్షాన్ని సాధించగలమని, మాదక ద్రవ్యాలతో బుద్ధి నష్టపోతుందని పేర్కొన్నారు. విద్యాలయాల్లో భగవద్గీత, రామాయణ మహాభారతాది ఇతిహాసాలను శిక్షణలో బోధించాలని పేర్కొన్నారు. మంచి ఆలోచనలు శిక్షణ ద్వారా అందని జనులు క్రూరమైన స్ర్తిమాన, ధన చోరులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైస్తవులు, ముస్లింలు వారి వారి మతాలను బోధనల ద్వారా చెప్తున్నట్లుగా హిందువులు కూడా తమ మత బోధనలు బోధించాలన్నారు.

దిగ్విజయ యాత్రలో భాగంగా మంగళవారం హైదరాబాద్ వచ్చిన జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామి విలేఖరుల
సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం