రాష్ట్రీయం
స్విస్ చాలెంజ్పై పీఛేముడ్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, అక్టోబర్ 26: అమరావతి రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయంపై ఏపి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. స్విస్చాలెంజ్ కింద కాంపిటీటివ్ బిడ్స్ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఏపి ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణంపై తాజా నోటిఫికేషన్ జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ ఈ విషయాన్ని హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సిఆర్డిఏ)ఈ ఏడాది జూలై 17వ తేదదీన అమరావతి రాజధాని నగరంలో స్టార్టప్ ఏరియా నిర్మాణం నిమిత్తం స్విస్చాలెంజ్ కింద నోటిఫికేషన్ జారీ చేసింది. సింగపూర్ కన్సార్టియం ఒరిజనల్ ప్రపోజల్ను ఆఫర్ చేసింది.
కాగా ఆదిత్య హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మెసర్స్ ఎన్వైన్ ఇంజనీర్స్ సంస్థ ఈ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నోటిఫికేషన్లో అంశాలు న్యాయసమ్మతంగా లేవని పిటిషనర్లు పేర్కొనడంతో, సిఆర్డిఏ సంస్థ ఆగస్టు 28వ తేదీన సవరణ చేస్తూ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు ఈ పిటిషన్లను విచారించారు. అంతకు ముందు హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టు పిటిషనర్ల వాదనలను విన్న తర్వాత స్టే ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట అపీల్కు వెళ్లింది. ఈ అపీల్ను బుధవారం హైకోర్టు విచారిస్తుండగా, ఏపి ఏజి జోక్యం చేసుకుని గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లో నిబంధనలను సవరణ చేసి తాజాగా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఏపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చట్టానికి కొన్ని సవరణలను ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు. ఈ చట్టానికి సవరణలు చేయనున్నందున నోటిఫికేషన్లో మార్పులు ఉంటాయన్నారు. ప్రభుత్వమే నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంటున్నందువల్ల పిటిషనర్ల అపీల్ను మూసివేయాలని ఏజి కోరారు. ఈ విషయమై హైకోర్టు ధర్మాసనం పిటిషనర్లను అడిగింది. కాగా ఏపి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ఇస్తే అందులో అభ్యంతరాలు ఉంటే సవాలు చేసేందుకు వీలుగా తమకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏజి స్టేట్మెంట్ను హైకోర్టు నమోదు చేసింది. ఈ కేసులో పిటిషనర్ల పిటిషన్ను, రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.