రాష్ట్రీయం

చంద్రబాబు బంగ్లా మరమ్మతుకు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వం ఢిల్లీలో కేటాయించిన బంగ్లా మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.82 కోట్లను గురువారం మంజూరు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి జీవో 2209ను జారీ చేశారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లినపుడు వారుండటానికి కేంద్రప్రభుత్వం వసతి కోసం భవనాలను కేటాయిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబునాయుడుకు ఢిల్లీలో జన్‌పథ్-1లో ఒక భవనాన్ని కేటాయించింది. తన స్థాయికి తగ్గట్టు ఆ భవనం మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించగా, ఆ మేరకు ఆయన ప్రతిపాదనలను పంపించారు. గతంలో హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ సౌకర్యాలకు ఐదు కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మదీనాగూడలోని ఒక ప్రైవేటు నివాసం కోసం 1.32 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే పార్కు హయత్‌లో చంద్రబాబు నివాసం ఉన్నన్నీ రోజులు ప్రభుత్వం దాని అద్దెను చెల్లించింది. మరో పక్క విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయానికి ఇప్పటికే దాదాపు 30 కోట్ల రూపాయలు వెచ్చించారు.