రాష్ట్రీయం

ఏపికి తప్పిన ‘కయాంత్’ ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 27: ఏపికి తుపాను ముప్పు తప్పింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ పూర్తిగా బలహీనపడింది. ఇది గురువారం వాయుగుండగా మారి, విశాఖకు 240 కిలో మీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా, మచిలీపట్నంకు సమాంతరంగా కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. దీని ప్రభావం వలన కోస్తా అంతటా గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. అయితే, మరో 24 గంటలపాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లద్దని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు.