రాష్ట్రీయం

ఎస్‌సి, ఎస్‌టిల నిధులు మళ్లించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఎస్‌సి, ఎస్‌టిలకు చెందాల్సిన సబ్-ప్లాన్ నిధులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్లిస్తున్నదని ఎపి కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్. తులసిరెడ్డి విమర్శించారు. అయినా చంద్రన్న దళిత, గిరిజన బాట పేరిట బస్తీల్లోని అమాయక పేద ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో సాధిస్తున్నట్లు గొప్పలు చెబుతున్న రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు విభజన చట్టంలోని హామీలు కాకుండా కొత్తగా ఏమి సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి రావెల వ్యంగ్యాస్త్రాలు, ఛలోక్తులు, డొంకతిరుగుళ్ళు మానాలని ఆయన హితవు చెప్పారు.