రాష్ట్రీయం

నిప్పంటించుకుని నిండు గర్భిణి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, అక్టోబర్ 29: పొట్టనింపుతూ జీవితాంతం పోషిస్తాడని నమ్మి ప్రేమించి కులాంతర వివాహమాడిన నిండు గర్భిణి భర్త నయవంచన, అత్త వేధింపులకులోనై అర్ధంతరంగా తనువు చాలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ పట్టణంలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గిరిజాల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల గ్రామానికి చెందిన జోత్స్న (23) సదాశివపేట పట్టణ పరిధిలోని ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లులో పనిచేయడానికి వలస వచ్చింది. పట్టణంలోని రవీంద్రనగర్‌కు చెందిన శివ అలియాస్ శివకుమార్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా జోత్స్నతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ నేపథ్యంలో 2014లో జోత్స్న, శివ కులాంతర వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు కాపురం సజావుగా కొనసాగగా భర్త శివ పని మానుకుని పేకాటకు బానిసగా మారాడు. మరోవైపు అత్త ప్రమీల కూడ తరచుగా వేధింపులకు గురిచేయడంతో తన కాపురాన్ని సరిదిద్దుకోవాలని ఓ ప్రైవేట్ వినోదపు ఛానల్‌లో నిర్వహిస్తున్న జట్కాబండి కార్యక్రమాన్ని ఆశ్రయించింది. జూలై 14న సదరు కార్యక్రమాన్ని ఆశ్రయించగా అక్కడి నిపుణులు చేసిన సూచనలతో మళ్లీ వచ్చి కాపురం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్త తీరు మారకపోగా అత్త వేధింపులు మరింత శృతిమించాయి. మరో పది, పక్షం రోజుల్లో పండంటి బిడ్డకు పురుడు పోసుకుంటానన్న విషయాన్ని కూడా మరిచిపోయిన బాధితురాలు ఆత్మహత్యే శరణ్యంగా భావించింది. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. మృతురాలి మరణ వాంగ్మూలాన్ని సేకరించడానికి మెజిస్ట్రేట్ వచ్చేలోపే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ప్రత్యక్షంగా పోలీసులకు అందించిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జోత్స్న తల్లిదండ్రులు, ఇతర బంధువుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

చిత్రం.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని మృత్యువుతో పోరాడుతూ బాధలను వ్యక్తం చేస్తున్న జోత్స్న