రాష్ట్రీయం
సిమి ఎన్కౌంటర్పై విచారణ జరపాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 1 November 2016
హైదరాబాద్, అక్టోబర్ 31: మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఎనిమిది మంది సిమి కార్యకర్తల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్పై పోలీసులు కట్టు కథ చెబుతున్నారని ఆయన సోమవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఎంతో పగడ్బంధీ సెక్యురిటీ ఉండే జైలు నుంచి అండర్ ట్రయల్ ఖైదీలు ఎలా తప్పించుకోగలరని, ఆ తర్వాత వారి వద్ద ఆయుధాలు ఎక్కడి నుంచి ఆయర ప్రశ్నించారు. జైలు నుంచి పరారైన గంటల్లోనే పోలీసులు ఆచూకి కనుకోవడం, వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో ప్రతిఘటించారని చెప్పడంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.